Charishma Krishna: ఆంధ్రా వర్సిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణకు మిస్ సౌత్ ఇండియా కిరీటం

  • మిస్ సౌత్ ఇండియా పోటీలు నిర్వహించిన పెగాసస్
  • ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా తమిళనాడు, కర్ణాటక భామలు
  • నృత్యకారిణిగా, నటిగా రాణిస్తున్న చరిష్మా కృష్ణ
AU Student Charishma Krishna got Miss South India crown

విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థినికి ‘మిస్ సౌత్ ఇండియా’ కిరీటం దక్కింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచారు. 

ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి యువతులు హాజరయ్యారు. అందరినీ వెనక్కి నెట్టిన ఛరిష్మా విజేతగా నిలిచారు. ఓ వైపు చదువును కొనసాగిస్తూనే నృత్యకారిణిగా, నటిగా రాణిస్తున్నారు. కాగా, ఈ పోటీలో తమిళనాడుకు చెందిన దేబ్‌నితా కర్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, కర్ణాటకకు చెందిన సమృద్ధి శెట్టి రెండో రన్నరప్‌గా నిలిచింది.

More Telugu News