ఏపీ సీఎంతో తెలంగాణ మంత్రి పువ్వాడ భేటీ!... ఫొటోలు ఇవిగో!
- ఈ నెల 20న పువ్వాడ అజయ్ కుమారుడి పెళ్లి
- కుమారుడి పెళ్లికి పిలిచేందుకు వెళ్లిన పువ్వాడ
- పువ్వాడ దంపతులకు సాదర స్వాగతం పలికిన జగన్ దంపతులు
ఈ నెల 20న పువ్వాడ అజయ్ కుమారుడి పెళ్లి జరగనుందట. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా అతిథులను పిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పువ్వాడ... జగన్ను తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు సతీసమేతంగా తాడేపల్లి వెళ్లారు. తన కుమారుడి పెళ్లికి రావాలంటూ ఆయన జగన్ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం జగన్ నివాసం నుంచి బయటకు వచ్చిన పువ్వాడ... జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తన తండ్రికి మంచి సంబంధాలుండేవని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో జగన్ తమకు మంచి ఆప్తుడని పువ్వాడ పేర్కొన్నారు.