అనుమతుల్లేని ప్రాజెక్టులను తక్షణమే ఆపండి... తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ ఆదేశం
- గతేడాది జులై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
- శుక్రవారంతో గడువు ముగిసిన గెజిట్ నోటిఫికేషన్
- శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయన్న బోర్డు
రెండు రాష్ట్రాల పరిధిలో అనుమతుల్లేకుండానే కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులను నిలిపివేయాలని కేంద్ర జలశక్తి శాఖ గతేడాది జులై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గడువు ఈ శుక్రవారంతో ముగిసిందని తెలిపింది.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయని తెలిపిన బోర్డు... వాటి పరిష్కారం నిమిత్తం రెండు ప్రాజెక్టులకు సంబంధించి 15 కాంపోనెంట్లను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం జరిగినట్లు పేర్కొంది. ఈ విషయంపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని తెలిపింది. ఈ నిర్ణయం అమలైతే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివాదాలు పరిష్కారం అవుతాయని కూడా బోర్డు అభిప్రాయపడింది.