స్లో పిచ్ పై మా బ్యాటర్లు రాణించలేకపోయారు: రాజస్థాన్ కెప్టెన్ సంజు శామ్సన్
- డెత్ ఓవర్లలో బౌండరీలు సాధించాల్సిందన్న సంజు
- 15-20 పరుగులు తక్కువ చేశామని వ్యాఖ్య
- ప్రత్యర్థి బౌలింగ్ బలంగా ఉందన్న రాజస్థాన్ కెప్టెన్
‘‘పిచ్ నిదానంగా ఉంది. అందుకే మా బ్యాట్స్ మెన్ ఫెయిల్ అయ్యారు. కనీసం మరో 15-20 పరుగులు అయినా అధికంగా చేయాల్సింది. వారు (కేకేఆర్) బౌలింగ్ బాగా చేశారు. మా బ్యాటింగ్ విషయానికొస్తే చివర్లో కొన్ని బౌండరీలు సాధించి ఉంటే బావుండేది’’ అని శామ్సన్ తెలిపాడు. నిన్నటి మ్యాచ్ లో శామ్సన్ 54 పరుగులతో ఈ సీజన్ లో రెండో అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ తో నిజంగా గట్టిగా పోరాటం చేశామన్న శామ్సన్.. ఇంకొంచెం కష్టపడితే మంచి ఫలితం దక్కేదన్నాడు.