రోడ్డు ప్రమాదంలో జనసైనికుడి మృతి... బీమా లేకపోయినా రూ.5 లక్షలు అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం
- తవిటి వెంకటేశ్ ఇటీవల కన్నుమూత
- క్రియాశీలక సభ్యత్వం తీసుకోని వెంకటేశ్
- దాంతో బీమా సౌకర్యం లభించని పరిస్థితి
- పెద్ద మనసు ప్రదర్శించిన పవన్ కల్యాణ్
అయితే, తవిటి వెంకటేశ్ పార్టీ తరఫున బీమా చేయించుకోలేదు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఔదార్యం ప్రదర్శించారు. వెంకటేశ్ కు బీమా లేకపోయినా, అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే చెక్కును అతడి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా జనసేన నేతల ద్వారా వెంకటేశ్ కుటుంబ పరిస్థితి విని పవన్ కల్యాణ్ చలించిపోయినట్టు తెలుస్తోంది.