Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

corona bulletin in inida
  • నిన్న 30,941 క‌రోనా కేసులు
  • కేసుల సంఖ్య మొత్తం 3,27,68,880
  • మ‌రో 350 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,38,560
దేశంలో నిన్న 30,941 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,27,68,880కి చేరింది. అలాగే, నిన్న 36,275 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 350 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,38,560కి పెరిగింది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,19,59,680 మంది కోలుకున్నారు. 3,70,640 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 64,05,28,644 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క‌ కేర‌ళ‌ రాష్ట్రంలోనే 19,622 కేసులు న‌మోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు.
Corona Virus
COVID19
India

More Telugu News