China: హిందూ మహాసముద్రంలో అండర్ వాటర్ డ్రోన్లు మోహరించిన చైనా

China deploys underwater drone in Indian Ocean
షార్ట్స్‌లో చూడండి
చైనా కుయుక్తుల్లో మరో ఉదంతం వెల్లడైంది. హిందూ మహాసముద్రంలో నౌకల కదలికలపై నిఘా వేసేందుకు చైనా అండర్ వాటర్ డ్రోన్లను మోహరించినట్టు వెల్లడైంది. ఈ మానవరహిత డ్రోన్లు జలాంతర్భాగంలో పయనిస్తూ నౌకలపై నిఘా వేసి ఉంచుతాయి. వీటిని సీ వింగ్ (హైయీ) అని పిలుస్తారు. ఈ అండర్ వాటర్ డ్రోన్లు నెలల తరబడి సముద్రాల్లోనే ఉంటాయి.

వీటిని చైనా గతేడాది డిసెంబరులో హిందూ మహాసముద్రంలో ప్రవేశపెట్టిందని, ఈ ఫిబ్రవరిలో వీటిని ఉపసంహరించుకుందని హై సట్టన్ అనే రక్షణ రంగ విశ్లేషకుడు వివరించారు. అప్పటికే అవి 3,400 కదలికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాయని తెలిపారు. ఈ సీ వింగ్ గ్లైడర్లు అమెరికా వద్ద ఉన్న అండర్ వాటర్ డ్రోన్ల తరహాలోనే ఉంటాయని హై సట్టన్ పేర్కొన్నారు. 2016లో అమెరికాకు చెందిన ఒక అండర్ వాటర్ డ్రోన్ ను చైనా స్వాధీనం చేసుకుంది.

గత కొంతకాలంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంపై పట్టు పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇక్కడ భారత్ ఆధిపత్యాన్ని భరించలేకపోతున్న చైనా.... భారత్ కు మిత్రపక్షాలుగా మారిన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ నావికా దళాలపై ఓ కన్నేసేందుకు ఈ సీ వింగ్ అండర్ వాటర్ డ్రోన్లను మోహరించినట్టు రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
Go Back to Shorts
China
Underwater Drones
Indian Ocean
Sea Wing Gliders
India

More Telugu News