మాకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వండి.. భారత్ ను వేడుకున్న నేపాల్!
- 20 శాతం జనాభాకు సరిపడా వ్యాక్సిన్ కొంటామని విన్నపం
- ఇప్పటికే పలు దేశాలను సంప్రదించిన నేపాల్
- రెండున్నర లక్షల మంది కరోనా బారిన పడిన వైనం
వ్యాక్సిన్ కోసం ఇప్పటికే పలు దేశాలను, కంపెనీలను నేపాల్ సంప్రదించింది. తాజాగా భారత ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. ఈ విషయాన్ని నేపాల్ మీడియా ప్రచురించింది. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేపాల్ కు తొలి ప్రాధాన్యతను ఇస్తామని గత నెలలోనే భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవలి కాలంలో ఆ దేశం చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.