తెలంగాణలోనే తొలిసారి.. హైదరాబాద్లో అందుబాటులోకి పాల ఏటీఎం
- ఎల్బీనగర్ పరధిలోని హనుమాన్ నగర్ చౌరస్తాలో ఏర్పాటు
- ప్రారంభించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
- ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు సేవలు
వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్టుగా పాలను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, డబ్బులను మాత్రం అక్కడే ఉండే సిబ్బందికి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి పాల ఏటీఎం అయిన దీనిని శ్రీ గీతా డెయిరీ చైర్మన్ లక్ష్మీనరసింహగుప్తా ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి నిన్న దీనిని ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఏటీఎం అందుబాటులో ఉంటుందని గుప్తా తెలిపారు.