గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు: బొత్స
- టీడీపీ నేతలపై బొత్స ధ్వజం
- రాష్ట్ర ప్రజలంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రమే కాదన్న బొత్స
- టెంట్ల కింద కూర్చున్నవాళ్లే రైతులా? అంటూ ఆగ్రహం
'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అని గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారని ఈ సందర్భంగా బొత్స వ్యాఖ్యానించారు. అక్కడ టెంట్ల కింద కూర్చుని ఉన్నవాళ్లే రైతులు, ఇంకెవరూ రైతులు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడని, కానీ మీకెవరిచ్చారని అర్ధరాత్రి పూట హైదరాబాద్ నుంచి విజయవాడ పరిగెత్తుకొచ్చారు? అంటూ బొత్స నిలదీశారు. 'తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో చర్యలు తీసుకుంటుందన్న భయంతో దొంగలా పారిపోయి వచ్చావు. మేం అలా చేయలేదే. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకున్నాం, ప్రజలందరికీ చెప్పాం, మూడు కమిటీలు కూడా వేశాం' అంటూ వ్యాఖ్యానించారు.