జైట్లీ నన్నెప్పుడు కలిసినా అడిగే మొదటి ప్రశ్న అదే: అయాజ్ మెమన్
- జైట్లీ భారత క్రికెట్ శ్రేయోభిలాషి
- ఎక్కడ కలిసినా తొలుత స్కోరెంతని అడిగేవారు
- రాజకీయాల్లో ఉన్నా క్రికెట్ను మర్చిపోలేదు
సీనియర్ స్పోర్ట్స్ రైటర్, కామెంటేటర్ అయిన అయాజ్ మెమన్.. జైట్లీతో తనకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా క్రికెట్పై తనకున్న అభిమానాన్ని మాత్రం ఆయన మర్చిపోలేదన్నారు. తామెప్పుడైన కలిస్తే ఆయన మొదట ‘స్కోర్ క్యా హై?’ (స్కోరెంత?) అని అడిగేవారని అయాజ్ తెలిపారు.. అరుణ్ జైట్లీ భారత క్రికెట్ శ్రేయోభిలాషి అని అయాజ్ పేర్కొన్నారు.