కేంద్రం ఇస్తున్న నిధులను ఏపీ ఖర్చు చేయట్లేదు: అమిత్ షా
- ఏపీకి ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్రం తీసుకొచ్చింది
- ఇక్కడి విమానాశ్రయం అభివృద్ధికి రూ.180 కోట్లు ఇచ్చాం
- ‘ఉగ్ర’ దాడి ఘటనను రాజకీయం చేయొద్దు
ఈ సందర్భంగా పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటన గురించి ప్రస్తావించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, అమర జవాన్లకు నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ ‘ఉగ్ర’దాడి ఘటనను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. రాజకీయాలకు ఓ హద్దు ఉంటుందని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూడటం తగదని హితవు పలికారు. సైనికులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, సైనికుల్లో ఆత్మస్థయిర్యం నింపేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని అన్నారు.