ఏపీ శాసన మండలి చైర్మన్ ఎన్నిక రేపు: నోటిఫికేషన్ జారీ
- నామినేషన్లకు ఈ రోజు సాయంత్రం గడువు
- టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ ఇప్పటికే ఖరారు
- ఎన్నిక ప్రక్రియ లాంఛనమే
దీంతో ఖాళీ అయిన ఈ స్థానంలో చైర్మన్గా టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ను ఎంపిక చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక లాంఛనాన్ని పూర్తి చేయాలని నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేశారు. బుధవారం సాయంత్రంలోగా నామినేషన్లకు గడువు విధించారు. గురువారం నామినేషన్ల పరిశీలన, తదనంతరం ఎన్నిక ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ అవకాశం లేనందున షరీఫ్ ఎన్నిక లాంఛనమే అని చెప్పొచ్చు.