మహిళ పట్ల సిద్ధరామయ్య అనుచిత ప్రవర్తన.. కన్నెర్రజేసిన జాతీయ మహిళా కమిషన్
- మైసూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఘటన
- మహిళ చేతిలోని మైకును లాక్కున్న సిద్ధరామయ్య
- ఆమె చున్నీ కూడా కొంత మేర ఆయన చేతిలోకి వచ్చిన వైనం
వివాదం వివరాల్లోకి వెళ్తే, మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ మహిళ పట్ల సిద్ధరామయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జమీలా అనే ఓ గ్రామ నాయకురాలు (కాంగ్రెస్ కార్యకర్త) మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్యను నిలదీశారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తమకు అందుబాటులో ఉండటం లేదని ఆమె ఆరోపించారు.
దీంతో, ఆగ్రహానికి గురైన సిద్ధరామయ్య... ఆమె చేతిలోని మైకును లాక్కున్నారు. అయితే, ఈ ప్రయత్నంలో పొరపాటున ఆమె ధరించిన చున్నీ కూడా కొంత మేర ఆయన చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె వాదిస్తూ ఉండటంతో... గద్దించి, ఆమెను సిద్ధరామయ్య కూర్చోబెట్టారు. బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ ఘటన వివాదాస్పదం అయింది.