అవనిగడ్డకు తిరిగొచ్చిన పాములు... వణుకుతున్న ప్రజలు!

  • ఎక్కడపడితే అక్కడ విషసర్పాలు
  • కొట్టి చంపుతున్న ప్రజలు
  • పాఠశాల మరుగుదొడ్లో పెద్ద సంఖ్యలో గుడ్లు
దాదాపు మూడు నెలల క్రితం కృష్ణా జిల్లా అవనిగడ్డను వణికించిన పాములు ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చాయి. మండలంలో ఎక్కడపడితే అక్కడ విషసర్పాలు తిరిగి చేరాయని, వాటిని చూసి తాము తీవ్ర భయాందోళన చెందుతున్నామని ప్రజలు అంటున్నారు. కోసూరువారి పాలెం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో నిన్న ఒక్కరోజే నాలుగు పాములను చంపామని తెలిపారు.

పాఠశాలలోని అమ్మాయిల మరుగుదొడ్లో పాము పెట్టిన గుడ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అన్నారు. వీటిని చూసిన విద్యార్థినీ విద్యార్థులు వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా, మంగళవారం నాడు ఇద్దరు పాము కాటుకు గురికాగా, వారిని అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చలికాలం కావడంతో, పాములు గుడ్లు పెట్టేందుకు అనుకూలమైన సమయమని, అందువల్లే అవి బయటకు వస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Avanigadda
Snakes
Krishna District
School

More Telugu News