మాల్యా మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.. చివరి టెస్టు మ్యాచ్ ను తిలకించడానికి వచ్చిన ఆర్థిక నేరస్తుడు!
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- స్టేడియంలోకి వస్తున్న మాల్యా
- ఇంగ్లండ్లో ఎంజాయ్
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనను కలిసేందుకు గతంలో మాల్యా ప్రయత్నించగా, భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో మ్యాచ్ చూసుకుని వెళ్లిపోయాడు. తాజాగా మరోమారు మ్యాచ్కు వచ్చి కలకలం రేపాడు. ఇంగ్లండ్ నుంచే తన వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న మాల్యాను దేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.