జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం.. కీలక అంశాలపై చర్చ!
- శాసనసభ సభ్యత్వాల రద్దుపై చర్చ
- చర్చకు వచ్చిన దామోదర్ రెడ్డి పార్టీ మారే అంశం
- గైర్హాజరైన డీకే అరుణ, పొంగులేటి తదితరులు
కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించినా... ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నేతలు చర్చించారు. కోర్టు తీర్పును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చలు జరిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి ఎలా పెంచాలనే విషయంపై చర్చించారు. ఈ సమావేశానికి డీకే అరుణ, చిన్నారెడ్డి, పొంగులేటి తదితరులు గైర్హాజరయ్యారు. డీకే అరుణకు తన నియోజకవర్గంలో ఇంతకు ముందే నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో హాజరుకాలేకపోయారు. సమావేశానికి హాజరుకాలేనని దామోదర్ రెడ్డి చెప్పినట్టు సమాచారం.