మోదీకి న్యూజిలాండ్ గడ్డపై 'హాకా' నృత్యంతో స్వాగతం... వీడియో వైరల్
- న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
- మావోరీ ఆదివాసీల 'హాకా' నృత్యంతో ఘన స్వాగతం
- 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్కు వెళ్లిన తొలి భారత ప్రధాని
- ఇరు దేశాల సంబంధాలు 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి
- భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ల ప్రకటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూజిలాండ్ పర్యటనలో అపూర్వ గౌరవం లభించింది. సుమారు 40 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే ప్రథమం. ఆక్లాండ్లోని గవర్నమెంట్ హౌస్లో ప్రధాని మోదీకి ఆ దేశ ఆదిమవాసీ మావోరీ తెగ తమ సాంప్రదాయ 'హాకా' నృత్యంతో గంభీరంగా స్వాగతం పలికింది.
శక్తివంతమైన కదలికలు, ప్రత్యేకమైన హావభావాలతో ప్రదర్శించే 'హాకా' నృత్యం, తమ దేశానికి వచ్చిన గౌరవనీయ అతిథులకు స్వాగతం పలకడానికి, బలం, ఐక్యతకు చిహ్నంగా మావోరీలు ప్రదర్శిస్తారు. అనంతరం న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ లక్సన్, మోదీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు.
ఈ పర్యటనలో ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనికోసం 'రోడ్మ్యాప్ టు 2030'ను కూడా ఆవిష్కరించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, విద్య, పర్యాటకం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించే దిశగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ల సిరీస్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రధాని మోదీకి హాకా నృత్యంతో స్వాగతం పలుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
శక్తివంతమైన కదలికలు, ప్రత్యేకమైన హావభావాలతో ప్రదర్శించే 'హాకా' నృత్యం, తమ దేశానికి వచ్చిన గౌరవనీయ అతిథులకు స్వాగతం పలకడానికి, బలం, ఐక్యతకు చిహ్నంగా మావోరీలు ప్రదర్శిస్తారు. అనంతరం న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ లక్సన్, మోదీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు.
ఈ పర్యటనలో ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనికోసం 'రోడ్మ్యాప్ టు 2030'ను కూడా ఆవిష్కరించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, విద్య, పర్యాటకం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించే దిశగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ల సిరీస్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రధాని మోదీకి హాకా నృత్యంతో స్వాగతం పలుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.