నిర్మాణాలు, కూల్చివేతలపై రెండేళ్ల నిషేధమా? నీతి ఆయోగ్ రిప్లయ్ ఇదిగో!

NITI Aayog Denies Recommending Construction Demolition Ban
  • మోదీ పొదుపు మంత్రం
  • దేశవ్యాప్తంగా నిర్మాణాలపై రెండేళ్ల నిషేధం వార్తలను ఖండించిన నీతి ఆయోగ్
  • ఈ మేరకు ఎలాంటి సిఫార్సు చేయలేదని ఎక్స్ వేదికగా స్పష్టత
  • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో నిర్మాణాలు ఆపాలంటూ తప్పుడు ప్రచారం
  • ప్రభుత్వ కార్యాలయాల పునర్నిర్మాణంపై వాయిదా సూచనలు ఇవ్వలేదని వెల్లడి
  • పెరిగిన వ్యయాలు, సరఫరా గొలుసు అంతరాయాలే కారణమంటూ తప్పుడు కథనాలు
దేశవ్యాప్తంగా నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను రెండేళ్ల పాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు వస్తున్న వార్తలను నీతి ఆయోగ్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని మంగళవారం స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా దేశంలో నిర్మాణాలను రెండేళ్లు నిలిపివేయాలని నీతి ఆయోగ్ సలహా ఇచ్చినట్లు మే 12న ఒక మీడియా కథనం ప్రచురితమైంది. ఈ కథనాన్ని ఉటంకిస్తూ స్పందించిన నీతి ఆయోగ్, "నిర్మాణాలపై నిషేధం విధించాలని మా సంస్థ ఎలాంటి సిఫార్సు చేయలేదని స్పష్టం చేస్తున్నాం" అని పేర్కొంది.

ముఖ్యంగా, ఢిల్లీలోని నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్, శాస్త్రి భవన్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేత, పునర్నిర్మాణ ప్రాజెక్టులను వాయిదా వేయాలని సూచించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే, ఈ భవనాల పునర్నిర్మాణ ప్రణాళికలను సంబంధిత మంత్రిత్వ శాఖలే చూసుకుంటున్నాయని, ఆ ప్రక్రియను వాయిదా వేయాలని తాము ఎలాంటి సూచన చేయలేదని నీతి ఆయోగ్ తేల్చిచెప్పింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇంధన వాడకాన్ని తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిర్మాణాలను నిలిపివేయాలన్న వదంతులకు ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా నీతి ఆయోగ్ ప్రకటనతో ఈ ప్రచారానికి తెరపడినట్లయింది.
Go Back to Shorts
NITI Aayog
Construction ban India
Demolition ban India
NITI Aayog clarification
Indian economy
West Asia crisis
Construction projects India
Narendra Modi
Energy consumption India

More Telugu News