Chandrababu Naidu: రేపు అయోధ్య వెళుతున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదే!
- ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి
- అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోనున్న చంద్రబాబు
- మూడు గంటల పాటు రామ జన్మభూమి కాంప్లెక్స్లో పర్యటన
- దర్శనం అనంతరం నేరుగా విజయవాడకు రాక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (డిసెంబర్ 28, ఆదివారం) అయోధ్యలో పర్యటించనున్నారు. శ్రీరామ జన్మభూమిలో కొలువుదీరిన బాలరాముడిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు అయోధ్య చేరుకుంటారు. అనంతరం నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్కు వెళతారు.
ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, సుమారు మూడు గంటల పాటు ఆయన ఆలయ ప్రాంగణంలోనే గడపనున్నారు. ఈ సమయంలో శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దర్శనం పూర్తయిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి ఆయన నేరుగా విజయవాడకు చేరుకుంటారు.
షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు అయోధ్య చేరుకుంటారు. అనంతరం నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్కు వెళతారు.
ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, సుమారు మూడు గంటల పాటు ఆయన ఆలయ ప్రాంగణంలోనే గడపనున్నారు. ఈ సమయంలో శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దర్శనం పూర్తయిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి ఆయన నేరుగా విజయవాడకు చేరుకుంటారు.