అఖిలేశ్ యాదవ్ ఫేస్బుక్ ఖాతా సస్పెన్షన్ ... బీజేపీపై ఎస్పీ ఫైర్
- 80 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న పేజీ అదృశ్యం
- బీజేపీ ప్రభుత్వ కుట్రేనని సమాజ్వాదీ పార్టీ ఆరోపణ
- ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ఎస్పీ నేతల ఆగ్రహం
ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి, తన రాజకీయ అభిప్రాయాలను పంచుకోవడానికి అఖిలేశ్ యాదవ్ ఫేస్బుక్ను చురుకుగా వినియోగిస్తుంటారు. తన మద్దతుదారులతో నిత్యం టచ్లో ఉండేందుకు ఈ ఖాతా ఆయనకు కీలకమైన వేదికగా ఉంది. అలాంటిది, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పేజీని సస్పెండ్ చేయడంపై ఎస్పీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఘటనపై ఎస్పీ అధికార ప్రతినిధి ఫక్రుల్ హసన్ చాంద్ ఎక్స్ వేదికగా స్పందించారు. "ప్రజా వ్యతిరేకతను అణచివేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడి ఖాతాను నిలిపివేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి" అని ఆయన విమర్శించారు. బీజేపీ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
అయితే, అఖిలేశ్ యాదవ్ ఖాతా సస్పెన్షన్కు గల కారణాలపై ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఈ వ్యవహారంపై సందిగ్ధత కొనసాగుతోంది.