ముంబైలోని విక్రోలీలో కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి.. వీడియో ఇదిగో!
- జనకల్యాణ్ సొసైటీలో అర్ధరాత్రి ఘటన.. నలుగురికి గాయాలు
- నగరాన్ని ముంచెత్తుతున్న వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- 24 గంటల్లో 248 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడి
వీడని వర్షాలు..
ముంబై నగరాన్ని వర్షాలు వీడడంలేదు. రెండు రోజులుగా సిటీని వర్షం ముంచెత్తుతోంది. శుక్రవారం ఉదయం 8:30 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల వరకు సిటీలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. విక్రోలీలో 248.5 మిల్లీమీటర్లు, శాంతాక్రజ్ లో 232.5 మిల్లీమీటర్లు, సియోన్ లో 221 మిల్లీమీటర్లు, జుహూలో 208 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు బాంద్రా, బైకుల్లా, ఛెంబూర్, కొలాబా తదితర ఏరియాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై సిటీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.