మధ్యాహ్నం బాంబులు పేలుతాయి!: బాంబే స్టాక్ ఎక్స్చేంజీకి బెదిరింపు మెయిల్
- ఈరోజు మూడు గంటలకు పేలుళ్లు సంభవిస్తాయని మెయిల్
- 'కామ్రేడ్ పినరాయి విజయన్' పేరుతో ఉన్న మెయిల్ ఐడీ నుంచి బెదిరింపు సందేశం
- ఎక్స్చేంజీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్
- అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని వెల్లడి
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎక్స్చేంజీ భవనంలో పేలుళ్లు సంభవిస్తాయని 'కామ్రేడ్ పినరాయి విజయన్' పేరుతో ఉన్న మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. బాంబు స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని తెలిపారు. ఇది నకిలీ బాంబు బెదిరింపు కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని పలు కళాశాలలకు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలకు, సెయింట్ థామస్ స్కూల్కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.