Rinku Singh: మహిళా ఎంపీతో క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి... జూన్ 8న నిశ్చితార్థం!

Rinku Singh Engagement with Priya Saroj Set for June 8
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియ సరోజ్‌ను వివాహం చేసుకోనున్నాడు. వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 8వ తేదీన జరగనుంది. ఈ వేడుకకు లక్నోలోని ఒక విలాసవంతమైన హోటల్‌ను వేదికగా ఎంచుకున్నారు.

రింకూ సింగ్, ప్రియ సరోజ్ మధ్య ఏడాది కాలంగా పరిచయం ఉందని ప్రియ తండ్రి, ఎమ్మెల్యే అయిన తుపాని సరోజ్ గతంలోనే వెల్లడించిన విషయం విదితమే. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని, వారి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, వీరి నిశ్చితార్థ వేడుకకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

25 ఏళ్ల ప్రియ సరోజ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచిలీషహర్‌ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేశారు. మరోవైపు, రింకూ సింగ్ భారత క్రికెట్ జట్టులో దూకుడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టులో కొనసాగుతున్నాడు.
Go Back to Shorts
Rinku Singh
Priya Saroj
Indian Cricketer
Samajwadi Party
Member of Parliament
Engagement
Uttar Pradesh
Cricket
Politics

More Telugu News