ప్రపంచం మరో యుద్ధాన్ని భరించలేదు: ఐరాస చీఫ్ గుటెర్రస్

World cannot afford military confrontation between India  Pakistan Guterres
పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని, ఇరుపక్షాలు అత్యంత సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు.

నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ చేపట్టిన సైనిక చర్యల పట్ల సెక్రటరీ జనరల్ తీవ్ర ఆందోళన చెందుతున్నారని డుజారిక్ మంగళవారం వెల్లడించారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది.

బుధవారం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించి, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాల స్థావరాలపై దాడులు చేసినట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది. "క్రూరమైన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ కచ్చితమైన, నియంత్రిత దాడులు జరిగాయి" అని పేర్కొంది. అంతకుముందు, భారత సైన్యం కూడా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని తొమ్మిది ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "న్యాయం జరిగింది. జై హింద్" అని భారత సైన్యం అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

"మొత్తం తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం. మా చర్యలు కేంద్రీకృతమైనవి, పరిమితమైనవి. ఉద్రిక్తతలను పెంచేవి కావు. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. లక్ష్యాల ఎంపికలో, దాడుల అమలులో భారత్ గణనీయమైన సంయమనం ప్రదర్శించింది" అని సైన్యం వివరించింది.
Go Back to Shorts
Antonio Guterres
India-Pakistan Conflict
Surgical Strikes
Operation Sundar
Pakistan Terrorism
UN Secretary General
International Border
Kashmir
Cross Border Terrorism

More Telugu News