కిమ్ పై విధేయతను పెంచడానికి ఉత్తరకొరియాలో పిల్లలకు శిక్షణా తరగతులు
- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం
- తనపై విధేయతను పెంచుకోవడానికి ప్రత్యేకంగా పిల్లలకు శిక్షణా తరగతులు
- ఈ విషయంలో పిల్లలకు శిక్షణ ఇచ్చే బోధకుల కోసం ఇటీవల ప్రత్యేకంగా వర్క్షాప్
బుధవారం నుంచి శనివారం వరకు దేశవ్యాప్తంగా ఉన్న బోధకుల కోసం పెద్ద ఎత్తున ప్యోంగ్యాంగ్లో ఈ వర్క్షాప్ జరిగిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ని ఉటంకిస్తూ యోన్హాప్ వార్తా సంస్థ తెలిపింది.
'రెడ్ నెక్టీ' యూనిట్ అని పిలువబడే దేశవ్యాప్తంగా ఉన్న బాలల సంఘాన్ని సూచిస్తుంది. ఇందులో 7 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు చేరాలి. 1946లో స్థాపించబడిన ఈ యూనియన్లో 3 మిలియన్ల మంది సభ్యులు ఉంటారని అంచనా.
ఇక ఈ కార్యక్రమం కిమ్ సూచనల మేరకు జరిగిందని, వర్క్షాప్లో ఆయన వ్యాఖ్యానించినట్లు కేసీఎన్ఏ తెలిపింది. అయితే, వివరాలు వెల్లడించలేదు.
"చిన్నప్పటి నుంచే సంస్థ విలువలను గౌరవించడం, తెలుసుకోవడం, దాని కార్యకలాపాల్లో స్వచ్ఛందంగా పాల్గొనడానికి అలవాటు పడటం పిల్లలకు నేర్పించాలి" అని వర్క్షాప్లో ఒక స్పీకర్ చెప్పినట్లు కేసీఎన్ఏ పేర్కొంది.