ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం
- నాగర్కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో ఘటన
- ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకొనేందుకు మహబూబ్నగర్ నుంచి వచ్చిన బాధిత యువతి
- యువతి బంధువుపై దాడిచేసి కాళ్లు చేతులు కట్టేసిన 8 మంది నిందితులు
- ఆపై యువతిని గుట్టల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం
ఈ క్రమంలో కాలకృత్యాల కోసం సమీపంలోని గుట్టప్రాంతంలోకి వెళ్గగా అప్పటికే అక్కడ ఉన్న 8 మంది యువకులు యువతిని అడ్డుకున్నారు. ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడిచేసి చేతులు కట్టేశారు. ఆపై యువతిని బలవంతంగా సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులను ఊర్కొండపేటకు చెందినవారిగా గుర్తించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.