Allu Aravind: శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్లు ఇస్తున్నాం: అల్లు అరవింద్

Allu Aravind and Dil Raju met Sri Tej in KIMS hospital
షార్ట్స్‌లో చూడండి
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి 'పుష్ప-2' టీమ్ భారీగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. శ్రీతేజ్ ను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ను, ఆయన తండ్రిని పరామర్శించారు. 

అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ... శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్ తరపున రూ. కోటి, 'పుష్ప-2' నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు ఇచ్చారని తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడని... ఆయనకు వెంటిలేటర్ తీసేశారని వెల్లడించారు. రూ. 2 కోట్లకు చెందిన చెక్కులను దిల్ రాజుకు అందజేశారు.
Go Back to Shorts
Allu Aravind
Dil Raju
Sukumar
Sri Tej

More Telugu News