Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఎనిమిది మంది మృత్యువాత పడడం పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు.