Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

CM Chandrababu shocked to know fatal accident in Chittoor district
షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఎనిమిది మంది మృత్యువాత పడడం పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు.
Go Back to Shorts
Road Accident
Chittoor District
Chandrababu
Andhra Pradesh

More Telugu News