Pawan Kalyan: గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan held talks with World Bank delegates
షార్ట్స్‌లో చూడండి
ఏపీ డిప్యూటీ సీఎం, గ్రామీణ తాగునీరు శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నేడు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత తాగునీటి సరఫరాపై వారితో సమీక్షించారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఏ మేరకు నిధులు ఇవ్వగలదనే అంశంపై చర్చించారు.

గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలియజేశారు. గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించబోమని స్పష్టం చేశారు. 

ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ తో పాటు ప్రపంచ బ్యాంకు జలవనరుల విభాగం సలహాదారు రమేశ్ ముకల్లా, మాథ్యూస్ ముల్లికల్, ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
World Bank
Drinking Water
Rural
Janasena
Andhra Pradesh

More Telugu News