టీ20 వరల్డ్కప్ ఫైనల్ ఫీవర్.. టీమిండియా గెలవాలని అభిమానుల ప్రత్యేక పూజలు!
- కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ పోరు
- దేశవ్యాప్తంగా పీక్కు చేరిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఫీవర్
- ప్రయాగ్ రాజ్, కాన్పుర్, వారణాసిలో భారత జట్టు గెలుపును కాంక్షిస్తూ పూజలు
యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పుర్లలో భారత జట్టు గెలుపును కాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం ప్రాంతంలో క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ గెలవాలని హారతి ఇచ్చారు. భారత సారధి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫొటోలు, జాతీయ జెండాలు పట్టుకొని 'జై హింద్' అంటూ నినాదాలు చేశారు. ఆటగాళ్ల ఫొటోలు ప్రదర్శిస్తూ మేళతాళాలతో భజన కూడా చేశారు. అటు వారణాసిలో కూడా భారత్ గెలవాలని క్రికెట్ లవర్స్ టీమిండియా ప్లేయర్ల ఫొటోలతో హోమం నిర్వహించారు.