147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పురుషులకు కూడా సాధ్యం కాని రికార్డు సాధించిన భారత ఉమెన్స్ జట్టు
కాగా ఈ మ్యాచ్లో భారత ఉమెన్ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ షఫాలీ వర్మ ఏకంగా డబుల్ సెంచరీ బాదింది. 197 బంతుల్లో 205 పరుగులు బాది రనౌట్ అయింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా భారీ శతకాన్ని నమోదు చేసింది. 161 బంతుల్లో 149 పరుగులు సాధించింది. తొలి వికెట్కు వీరిద్దరూ కలిసి ఏకంగా 292 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇక సుభా సతీశ 15, జమియా రోడ్రిగేజ్ 55, హర్మాన్ప్రీత్ కౌర్ 42(నాటౌట్), రీచా ఘోష్ 43 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
ఇక దక్షిణాఫ్రికా ఉమెన్స్ బౌలర్ల విషయానికి వస్తే డెల్మీ టక్కర్ రెండు కీలకమైన వికెట్లు తీసింది. అయితే ఆమె ఏకంగా 141 పరుగులు సమర్పించుకుంది. ఇక నదినే డీ క్లెర్క్ ఒక వికెట్ పడగొట్టగా మరో వికెట్ రనౌట్ (షఫాలీ వర్మ) రూపంలో దక్కింది.