వందేభారత్ రైళ్ల స్పీడ్ తగ్గింది.. కారణం ఏంటంటే..!
- ట్రయల్ రన్ లో గంటకు 99 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన రైలు
- తొలినాళ్లలో సగటున 84.48 కి.మీ. వేగంతో నడిపిన అధికారులు
- ప్రస్తుతం గంటకు సగటున 76.25 కి.మీ. వేగంతో నడుస్తున్నట్లు వెల్లడి
2022-23 నాటికి ఈ రైళ్ల వేగాన్ని గంటకు సగటున 81.38 కిలోమీటర్లకు తగ్గించినట్లు వివరించారు. వర్షాకాలంలో సగటున 75 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడం సవాలుతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. వాస్తవానికి వందేభారత్ రైళ్లకు గరిష్ఠంగా గంటకు 160 కి.మీ. వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉందని చెప్పారు. అయితే, ఆ వేగానికి మన దేశంలోని రైల్వే ట్రాక్ లు సరిపడవని, వాటి సామర్థ్యం అంతలేదని వివరించారు. కేవలం ఢిల్లీ, ఆగ్రా మధ్య ఉన్న కొన్ని ట్రాక్ లపైనే ఈ వేగాన్ని అందుకోవడం సాధ్యమని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రస్తుతం కూడా కొన్ని రైళ్లు గరిష్ఠంగా గంటకు 160 కి.మీ. వేగంతో పరుగులు పెడుతున్నాయని వివరించారు. మరికొన్ని ట్రాక్ లపై గరిష్ఠ వేగం చాలా తక్కువన్నారు. ఉదాహరణకు డెహ్రడూన్ - ఆనంద్ విహార్ ట్రాక్ పై రైళ్ల వేగం సగటున 63.42 కిలోమీటర్లు, పాట్నా - రాంచీ ట్రాక్ పై 62.9 కి.మీ., కోయంబత్తూర్ - బెంగళూర్ ట్రాక్ పై గంటకు 58.11 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైళ్లు నడుస్తాయని అధికారులు వివరించారు.