తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ధాన్యం కొనుగోలు, వ్యవసాయంపై సమీక్ష
- నిన్నటి వరకు ఎన్నికల బిజీలో ముఖ్యమంత్రి
- ఎక్కడా తాగునీరు సమస్యలు తలెత్తకూడదని అధికారులకు ఆదేశం
నిన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల బిజీలో ఉన్నారు. ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించారు. ఎక్కడా తాగునీరు సమస్యలు తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు.