శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి మహేశ్బాబు భార్య నమ్రత
- గోపులారం గ్రామంలో ఇటీవల రెండెకరాల భూమిని కొనుగోలు చేసిన నమ్రత
- రిజిస్ట్రేషన్ నిమిత్తం కార్యాలయానికి
- గుర్తుపట్టి సందడి చేసిన మహేశ్ ఫ్యాన్స్
ఈ క్రమంలో ఆమెను గుర్తించిన మహేశ్ అభిమానులు నమ్రతను చుట్టుముట్టి సందడి చేశారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో హడావుడి కనిపించింది. నమ్రత ఏమాత్రం విసుగు చెందకుండా అందరితో ఫొటోలు దిగారు.