ల్యాండింగ్ సమయంలో పైలట్ కళ్లలోకి లేజర్ కాంతి.. తప్పిన పెను ప్రమాదం
- 165 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి కోల్కతా బయలుదేరిన విమానం
- విమానం ల్యాండ్ కావడానికి కిలోమీటరు ముందు కాక్పిట్లోకి లేజర్ లైట్
- మసకబారిన పైలట్ కళ్లు.. మరికాసేపు పడి వుంటే కళ్లు పోయేవే!
ఇండిగో విమానం 6ఈ223 రన్వేను సమీపిస్తున్న వేళ కైఖాలి సమీపంలో ఈ ఘటన జరిగినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. లేజర్ కాంతి పడడం వల్ల పైలట్ కళ్లకు ఏమైనా జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ల్యాండింగ్ను అడ్డుకోవడంతోపాటు ఆలస్యానికి కారణమవుతాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన డీజీసీఏ పైలట్ల కళ్లను రక్షించి, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విమానాశ్రయానికి 18.5 కిలోమీటర్ల పరిధిలో లేజర్ లైట్లు ఉపయోగించకుండా ఎక్స్క్లూజన్ జోన్గా చేయడాన్ని తప్పనిసరి చేసింది.