చంద్రబాబు కళ్లలో బంగారు భవిష్యత్తు చూసేందుకే..: పవన్ పై వైవీ సుబ్బారెడ్డి సెటైర్లు
- వైసీపీ తుది జాబితాలో చోటు దక్కిన వారే అభ్యర్థులన్న సుబ్బారెడ్డి
- టీడీపీకి 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని ఎద్దేవా
- ఎన్ని కూటములు వచ్చినా వైసీపీదే గెలుపని ధీమా
టీడీపీ - జనసేన కూటమి అభ్యర్థుల జాబితాపై స్పందిస్తూ... అభ్యర్థుల ఎంపిక కోసం ఎప్పుడూ చేయనంత సుదీర్ఘ కసరత్తు చేశానని చంద్రబాబు అన్నారని... చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వైసీపీ అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. టీడీపీకి ఇప్పటికీ 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని... అభ్యర్థులను వెతుక్కునే పనిలో వారు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు బంగారు భవిష్యత్తును చూసేందుకే పవన్ కల్యాణ్ 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్ని కూటములు వచ్చినా గెలుపు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.