పీవోడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య భర్త మృతి

  • గుండెపోటు కారణంగా హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరిక
  • చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూత
  • ఆసుపత్రికి చేరుకొని నివాళులర్పించిన వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు
పీవోడబ్ల్యు (ప్రగతిశీల మహిళా సంఘం) అధ్యక్షురాలు సంధ్య భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. రామకృష్ణా రెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. సంధ్య భర్త మృతి చెందిన విషయం తెలిసి వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆసుపత్రికి చేరుకున్నారు. వారు రామకృష్ణా రెడ్డికి నివాళులు అర్పించారు. ఆయన భార్య సంధ్యను ఓదార్చారు.
Go Back to Shorts
POW Sandhya
heart attack
Hyderabad

More Telugu News