నాటకాలు ఆడటంలో కేసీఆర్ను మించిన దిట్టలేడు: మంత్రి జూపల్లి కృష్ణారావు
- కేఆర్ఎంబీ విషయంలో నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు ఏమిటి? అని ప్రశ్న
- ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందే కేసీఆర్ అని ఆరోపణ
- కమీషన్ల కోసమే కాళేశ్వరానికి అనుమతులు తెచ్చుకున్నారన్న జూపల్లి
- పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కేసీఆర్ జలవివాదాన్ని ముందుకు తెచ్చారన్న మంత్రి
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు ఓడించి శిక్ష వేసినా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. కేసీఆర్ తన పదేళ్ల పాలన సమయంలో పాలమూరు - రంగారెడ్డికి అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? అని నిలదీశారు. కానీ కాళేశ్వరానికి ఆదరాబాదరాగా అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరానికి మాత్రం అనుమతులు తెచ్చారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కేసీఆర్ జలవివాదాన్ని ముందుకు తెచ్చారన్నారు.