Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ... అమెరికాలో రాముడి దివ్యరూపంతో వెలిగిపోయిన టైమ్స్ స్క్వేర్

New York Times Square enlightened with Sri Ram
షార్ట్స్‌లో చూడండి
అయోధ్యలో నేడు దశరథ తనయుడు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో, అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ డిజిటల్ స్క్రీన్లపై శ్రీరాముడి దివ్యరూపాన్ని ప్రదర్శించారు. టైమ్స్ స్క్వేర్ కూడలి వద్దకు భారీగా హాజరైన ప్రవాస భారతీయులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. త్రివర్ణ పతాకాలు, కాషాయ జెండాల రెపరెపలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
Go Back to Shorts
Ayodhya Ram Mandir
Times Square
Sri Ram
New York
USA
India

More Telugu News