పురుషుల టీ20 క్రికెట్లో పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్
- 136వ గెలుపుతో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచిన టీమిండియా
- 135 విజయాలతో రెండవ స్థానానికి పడిపోయిన పాకిస్థాన్
- ఆస్ట్రేలియాపై 4వ టీ20 మ్యాచ్ గెలుపుతో చరిత్ర సృష్టించిన భారత్
భారత్, పాకిస్థాన్ జట్లు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తున్నప్పటికీ సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. ఈ విజయాలను బట్టి టీ20 ఫార్మాట్లో టీమిండియా స్థిరత్వాన్ని తెలియజేస్తున్నాయి. 2007లో ఆరంభ టీ20 వరల్డ్ కప్ను భారత్ కైవశం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఫార్మాట్లో భారత్ స్థిరంగా రాణిస్తోంది. కాగా రాయ్పూర్ వేదికగా జరిగిన 4వ టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సీరిస్ను 3-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన రింకూ సింగ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో పర్యాటక ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.