GV Anjaneyulu: ఏపీలో సాగర్ కుడి, ఎడమ కాల్వలకు తేడా తెలియని మంత్రులు ఉన్నారు: టీడీపీ నేత జీవీ ఆంజనేయులు

TDP leader GV Anjaneyulu take a jibe at YCP govt on Sagar dam issue
షార్ట్స్‌లో చూడండి
నాగార్జునసాగర్ డ్యామ్ అంశంలో టీడీపీ నేత జీవీ ఆంజనేయులు స్పందించారు. ఏపీలో సాగర్ కుడి, ఎడమ కాల్వలకు తేడా తెలియని మంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. పంటలు పండించే నీళ్లతో రాజకీయ పంట పండించే అపర మేధావి జగన్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అసలు నీళ్లే లేని చోట వివాదాలా? అని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు ఆగి ఇప్పుడు నీటి వివాదం తీసుకువస్తున్నారని మండిపడ్డారు. డెల్టాకు నీరు ఇవ్వాలని రైతులు కోరుతున్నా జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా మౌనంగా ఉన్నారని, ఇప్పుడు పోలీసుల దండయాత్ర దేనికో జగనే చెప్పాలని జీవీ ఆంజనేయులు నిలదీశారు.
Go Back to Shorts
GV Anjaneyulu
Nagarjuna Sagar Dam
TDP
Jagan
YSRCP
Andhra Pradesh
Telangana

More Telugu News