ప్రపంచ వాతావరణ సదస్సు కోసం దుబాయ్ పయనమైన ప్రధాని మోదీ
- యూఏఈ అధ్యక్షతన ప్రపంచ వాతావరణ సదస్సు
- రేపు దుబాయ్ లో సమావేశం
- ఈ సమావేశానికి మోదీని ఆహ్వానించిన యూఏఈ అధ్యక్షుడు
దీనిపై మోదీ స్పందిస్తూ, యూఏఈ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుండడం సంతోషదాయకమని తెలిపారు. వాతావరణ పరిరక్షణ అంశంలో భారత్ కు యూఏఈ ముఖ్యమైన భాగస్వామిగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన జీ20 సమావేశాల్లోనూ వాతావరణ కార్యాచరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని మోదీ వివరించారు.