ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్తో తప్పిన ముప్పు
- భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానం
- మార్గమధ్యంలో పక్షి ఢీకొనడంతో సాంకేతిక లోపం
- వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి భువనేశ్వర్లో ల్యాండ్ చేసిన పైలట్
- 180 మంది ప్రాణాలు కాపాడాడంటూ ప్రశంసలు
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందికి దింపారు. వారిని మరో విమానంలో ఢిల్లీకి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ల్యాండ్ అయిన విమానం ఈ రోజంతా భువనేశ్వర్లోనే ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్పై ప్రశంసలు కురుస్తున్నాయి.