Nara Lokesh: యువగళం సంఘీభావయాత్రలో కార్యకర్తల హంగామా.. మీసాలు మెలేసిన వైసీపీ ఎమ్మెల్యే

  • వినుకొండ యాత్రలో టీడీపీ కార్యకర్తలకు ఎదురుపడిన వైసీపీ ఎమ్మెల్యే వాహనం
  • జై తెలుగుదేశం అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు
  • కారు దిగి, ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
YCP MLA fires at TDP activists in Lokesh padayatra

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఆయన పాదయాత్రకు సంఘీభావంగా ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు యాత్ర చేపడుతున్నారు. నేడు వినుకొండలో స్థానిక నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ సమయంలో వారికి వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వాహనం ఎదురుపడింది. దీంతో ఈ యాత్రలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జై తెలుగుదేశం... జై చంద్రబాబు... జై లోకేశ్ అంటూ నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే వాహనం ముందు టీడీపీ కార్యకర్తలు కాస్త హంగామా చేశారు. దీంతో ఆగ్రహోదగ్రుడైన ఎమ్మెల్యే కారు దిగి, టీడీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. దమ్ముంటే రావాలని మీసాలు మెలేశారు. పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కార్యకర్తలను నిలువరించి, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును అక్కడి నుండి పంపించారు.

More Telugu News