Karnataka: లీడింగ్ లో కాంగ్రెస్.. ఢిల్లీలో అప్పుడే ప్రారంభమైన సంబరాలు

  • స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్
  • 117 స్థానాల్లో లీడ్ లో ఉన్న కాంగ్రెస్
  • మిఠాయిలు పంచుకుంటున్న పార్టీ శ్రేణులు
Congress workers celebrations at AICC office in Delhi

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (113) కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ 117 స్థానాల్లో లీడ్ లో ఉండగా... బీజేపీ 73, జేడీఎస్ 29, ఇతరులు 5 సీట్లలో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

More Telugu News