IPL 2023: క్రికెట్ బెట్టింగ్ కోసం అప్పు.. తీర్చలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

  • అనకాపల్లి జిల్లా దిబ్బలపాలెంలో ఘటన
  • అప్పు చేసి ఐపీఎల్‌లో బెట్టింగులు
  • ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం
  • చికిత్స పొందుతూ మృతి
Degree Student Committed Suicide Over Debts

క్రికెట్ బెట్టింగుతో అప్పులపాలైన ఓ యువకుడు వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లి జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పెంటకోట మధుకుమార్ (20) అనకాలపల్లిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.

క్రికెట్ బెట్టింగ్‌లు కట్టే అలవాటున్న మధుకుమార్ ఐపీఎల్‌లో పందేల కోసం అదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలంటూ అతడి నుంచి ఒత్తిడి పెరిగింది. అయితే, తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 23న రాత్రి ఎలుకల మందు తాగి మధుకుమార్ ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News