గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాం.. ఆస్తులు జప్తు చేశాం: అనిత
- గంజాయి సాగును రికార్డు స్థాయిలో సున్నాకు చేర్చామన్న అనిత
- దీని కారణంగా క్రైమ్ రేటు 14 శాతం తగ్గిందని వెల్లడి
- ఈగిల్ వింగ్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని కితాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగును రికార్డు స్థాయిలో దాదాపు సున్నాకు చేర్చామని, దీని కారణంగా ఏపీలో నేరాల రేటు ఏకంగా 14 శాతం తగ్గిందని ఏపీ హోంమంత్రి అనిత వెల్లడించారు.
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపేలా రాబోయే రోజుల్లో ఏజెన్సీ ఏరియాల్లో తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని, డ్రగ్స్ సమాచారాన్ని గోప్యంగా అందించడానికి ‘ఈగల్’ కొత్త వెబ్సైట్, టోల్ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి తెచ్చామని అనిత తెలిపారు.