ఖమేనీ అంత్యక్రియలకు మోదీ దూరం.. భారత్ తరఫున వెళ్లేది వీరే..!
- జులై 4న ఖమేనీ అంతక్రియలు ప్రారంభం
- ఆ సమయంలో ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనకు మోదీ
- ముందే ఖరారైన షెడ్యూల్ కారణంగా అంత్యక్రియలకు ప్రధాని దూరం
- భారత్ తరఫున బిహార్ గవర్నర్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి
- జులై 9న ఖమేనీ ఖననం
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇటీవల ప్రధాని మోదీకి అధికారికంగా ఆహ్వానం పంపారు. అయితే ఆ సమయంలో ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటన ఇప్పటికే ఖరారు కావడంతో మోదీ హాజరు కాలేకపోతున్నారు. ఈ షెడ్యూల్ ముందుగానే ఖరారైందని అధికార వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. తొలుత మార్చిలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. కానీ ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా వాటిని వాయిదా వేశారు. ఇప్పుడు జులైలో పలువురు దేశాధినేతలు, ప్రతినిధుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జులై 4న టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా సముదాయంలో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. చివరి అంత్యక్రియలు జులై 9న ఖమేనీ స్వస్థలమైన మష్హద్లోని ఇమామ్ రెజా దర్గా వద్ద జరగనున్నాయి.