BRS: బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వని మహారాష్ట్ర పోలీసులు

  • ఈ నెల 24న ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ సభ
  • అంఖాస్ మైదానంలో సభకు అనుమతిని ఇవ్వని పోలీసులు
  • మిలింద్ కాలేజీ సమీపంలో సభ పెట్టుకోవాలని సూచన
Maharashtra police denied permission to BRS

బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర ఔరంగాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఈ నెల 24న అంఖాస్ మైదానంలో తలపెట్టిన సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే, భద్రతాకారణాల రీత్యా ఇక్కడ సభకు అనుమతిని ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. మిలింద్ కాలేజీ సమీపంలో సభను నిర్వహించుకోవాలని సూచించారు. 

మరోవైపు మిలింద్ కాలేజీ సమీపంలో సభకు కేసీఆర్ సుముఖంగా లేరని సమాచారం. మరో ప్రదేశంలో సభ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మహారాష్ట్రలో కేసీఆర్ ఇప్పటికే రెండు భారీ సభలను నిర్వహించారు. ఇప్పుడు మూడో సభ ద్వారా ఆ రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు.

More Telugu News